న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్పీఐలు) డిసెంబర్లో భారతీయ ఈక్విటీలలో రూ. 11,119 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో ఇటీవల వీళ్లు జాగ్రత్తగా ఉంటున్నారు. నవంబర్లో ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేసిన రూ.36,239 కోట్లతో పోలిస్తే డిసెంబరులో ఇన్ఫ్లో చాలా తక్కువగా ఉంది.
"మార్కెట్లలో కరెక్షన్ కనిపిస్తోంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా మళ్లీ వస్తోంది. యూఎస్లో మాంద్యం ఆందోళనలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఎఫ్పీఐలు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో (డిసెంబర్లో) నికర కొనుగోలుదారులుగా ఉన్నారు" అని మార్నింగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. భారతీయ మార్కెట్లు ఇటీవల ఆల్-టైమ్ హైని తాకడంతో చాలా మంది పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకున్నారు.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచడం, క్రూడ్ ధరలు ఎక్కువ కావడం, యుద్ధం పాటు ఇన్ఫ్లేషన్ కారణంగా 2022లో ఎఫ్పీఐలు రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారని డిపాజిటరీ డేటా వెల్లడించింది.