కొత్తగూడెంలో పర్యటించిన ఫారెస్ట్​ సెంట్రల్​ టీమ్

కొత్తగూడెంలో పర్యటించిన ఫారెస్ట్​ సెంట్రల్​ టీమ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో డిప్యూటీ డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారెస్ట్​(సెంట్రల్​) డాక్టర్​వి.జార్జ్​ జెన్నర్​ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్​ఎన్విరాన్​మెంట్, ఫారెస్ట్​అండ్​క్లైమెంట్​చేంజ్​చైన్నై బృందం గురువారం పర్యటించింది. ఏరియాలోని  పీవీకే–5 ఇంక్లైన్​ను సందర్శించింది. అండర్​ గ్రౌండ్​ మైన్​లో మ్యాన్​ రైడింగ్​ విధానాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. కంటిన్యూస్​ మైన్​ద్వారా పీవీకే–5 ఇంక్లైన్​లో బొగ్గు ఉత్పత్తి, కోల్​ ట్రాన్స్​పోర్టు చేస్తున్న వివరాలను ఆఫీసర్లు వివరించారు.

 అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెందు గెస్ట్​ హౌస్​లో కంపెనీ డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, ఎల్​వీ. సూర్యనారాయణ సింగరేణి బొగ్గు గనుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం చేపడ్తున్న చర్యలు, మొక్కల పెంపకం వివరాలను బృందానికి వివరించారు. ఈ ప్రోగ్రాంలో డాక్టర్​జి.త్రినాథ్, పార్టీన్, కన్జర్వేటర్​ఆఫ్​ఫారెస్ట్​భీమా నాయక్, ఖమ్మం జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​సిద్ధార్థ్​ విక్రం సింగ్, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి పాల్గొన్నారు.