మంత్రి, పీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

మంత్రి, పీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​కు చెందిన బీఆర్ఎస్​ మాజీ కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్​ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్​మహేశ్ కుమార్​గౌడ్ సమక్షంలో కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరినవారికి కాంగ్రెస్​కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్​లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని వారు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్​లో చేరినవారిలో  గంగా మోహన్​చక్రు, పండిత్​ ప్రేమ్ కుమార్, సడాక్ ​ప్రమోద్, బిజ్జు సంతోష్​ కుమార్​తదితరులు ఉన్నారు.