కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు : పి.సుదర్శన్​రెడ్డి

కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు : పి.సుదర్శన్​రెడ్డి

మాజీమంత్రి పి.సుదర్శన్​రెడ్డి

బోధన్, వెలుగు: సీఎం కేసీఆర్​ మాయమాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ  మంత్రి పి.సుదర్శన్ రెడ్డి సూచించారు.  బుధవారం బోధన్​లోని రాకాసిపేట్​లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ప్రజలకిచ్చిన ఏ హామీని ప్రభుత్వం నేరవేర్చలేదని వాపోయారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, డబుల్​ బెడ్​రూమ్ ​ఇండ్లు ఎటు పోయాయని ప్రశ్నించారు.

పేరుకే జాబ్​ నోటిఫికేషన్లు వేసి, ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోందని హామీ ఇచ్చారు. రైతులకు  రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, అర్హులైన పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్​ని ఆదరించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్​చైర్ పర్సన్​ భర్త తూము శరత్​రెడ్డి, కాంగ్రెస్​ టౌన్​ప్రెసిండెట్​ పాషా మొయినోద్దీన్ పాల్గొన్నారు.