- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, వెలుగు : ప్రజావ్యతిరేకత బట్టబయలవుతుందనే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్పార్టీ హద్దుల్లేని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక బీఆర్ఎస్ప్రభుత్వంపై బురద జల్లుతోందన్నారు. ప్రజలు అడిగినా, అడగకున్నా పథకాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ పనుల్లో పడి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామని వెల్లడించారు. కేసీఆర్పై ప్రజల్లో సానుకూలత ఉందని, పార్లమెంట్ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నారు.
మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ప్రభుత్వంలో ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని చెప్పారు. రైతుబంధు అందరికీ వేశామని డిప్యూటీ సీఎం చెప్తే.. సంక్రాంతి తర్వాత ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని వివరించారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే స్పష్టత మంత్రులకే లేదని విమర్శించారు.