నా సత్తా ఏంటో చూపిస్తా.. మోసం చేసిన వాళ్లకు శిక్ష తప్పదు: శంకర్ నాయక్

నా సత్తా ఏంటో చూపిస్తా.. మోసం చేసిన వాళ్లకు శిక్ష తప్పదు: శంకర్ నాయక్

మహబూబాబాద్ లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, తన జోలికి ఎవరన్నా వస్తే సహించేది లేదని, తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. తాను భూమి కబ్జా చేశాననే ఆరోపణలపై నిజమేంటో రుజువు చేస్తానని.. ఎవరెవరికి క్లారిటీ కావాలో వారంతా నెహ్రూ సెంటర్ లోకి రావాలని సవాల్ విసిరారు. 

పార్టీకి దొహ్రం చేసిన వారిని వదిలిపెట్టానని.. సొంతపార్టీలో ఉండి తల్లిపాలు తాగే నాయకులే వల్లే తాను ఓటమి పాలయ్యానని శంకర్ నాయక్ అన్నారు. ప్రజలు మార్పు మత్తులో ఉండి.. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృధ్ధి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. త్వరలోమత్తు ఒదులుతుందని ఆ తర్వాత తాము కనిపిస్తామన్నారు. తాను ప్రజల తీర్పును గౌరవిస్తానని తెలిపారు. పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తూ.. పార్టీని మోసం చేసిన వాళ్లకు శిక్ష తప్పదన్నారు శంకర్ నాయక్.