- మాజీ ఎంపీ వినోద్కుమార్
గంగాధర, వెలుగు: కొనుగోళ్లలో తరుగు పేరుతో వడ్లు కటింగ్ చేయొద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ నిర్వాహకులకు సూచించారు. గంగాధర మండలం వెంకంపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లలో జాప్యం ఎందుకు జరుగుతుందని మండిపడ్డారు. తాలు, తేమ వంటి కారణాలు చూపుతూ బస్తాకు నాలుగైదు కేజీలు కటింగ్ చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మహిపాల్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్రావు, లీడర్లు కంకణాల విజేందర్రెడ్డి, వేముల దామోదర్, నాగి శేఖర్, సురేందర్రెడ్డి
పాల్గొన్నారు.
