కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాలకు న్యాయం : రామ్మోహన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీతోనే  అన్నివర్గాలకు న్యాయం : రామ్మోహన్ రెడ్డి

గండీడ్, వెలుగు: కాంగ్రెస్  పార్టీతోనే బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్  పావని వెంకట్ తో పాటు 50 మంది బీఆర్ఎస్  లీడర్లు కాంగ్రెస్  పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలతో ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నారాయణ, రాములు పాల్గొన్నారు.