
సింగపూర్: శ్రీలంక మాజీ ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స థాయ్లాండ్కు చేరుకున్నారు. గురువారంతో వీసా గడువు ముగిసిపోవడంతో గోటబయ సింగపూర్ నుంచి వదిలారు. గోటబయ రాకను థాయ్లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ -ఓ -చా ధ్రువీకరించారు. కొన్నిరోజులు దేశంలో ఉండేందుకు గోటబయకు అనుమతిచ్చామని చెప్పారు. తమ దేశంలో రాజకీయ కార్యకలాపాలు జరపకూడదని కండీషన్ పెట్టినట్లు వివరించారు. ఆందోళనల కారణంగా జులై 13న గోటబయ శ్రీలంక విడిచి మాల్దీవులకు, ఆపై సింగపూర్ కు పారిపోయారు. అక్కడి నుంచే ఆశ్రయం కోసం థాయ్లాండ్కు విజ్ఞప్తి చేశారు. దీంతో కొన్నిరోజులు థాయ్లాండ్లో ఉండేందుకు గోటబయకు పర్మిషన్ ఇచ్చినట్లు ప్రధాని ప్రయూత్ పేర్కొన్నారు.