తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు గాయం అయ్యింది. దీంతో ఆయను వెంటనే యశోద ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 7న రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ బాత్రూంలో కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయం అయ్యింది. అర్థరాత్రి 2.30 గంటలకు అందుబాటులో ఉన్న సిబ్బంది సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే, స్కానింగ్ పూర్తి చేసిన డాక్టర్లు.. కేసీఆర్ కాలి తుంటి ఎముక దగ్గర గాయం అయినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోగా..బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.. ఫలితాల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ అప్పటి నుంచి తన ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. పార్టీకార్యకర్తలు, నేతలు కేసీఆర్ ను కలుస్తున్నారు.