ఓపెన్​ సిట్టింగులో కుర్చీ కోసం కొట్టుకున్నరు

ఓపెన్​ సిట్టింగులో కుర్చీ కోసం కొట్టుకున్నరు

గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్​ జిల్లా గన్నేరువరంలోని వైన్​ షాపు వద్ద కుర్చీ కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఓ వ్యక్తి  గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం శివారులోని రాజరాజేశ్వర వైన్స్‌‌ పక్కనే ఓపెన్ ​సిట్టింగ్​ఉంది. బుధవారం సాయంత్రం  మైలారం గ్రామానికి చెందిన కొంతమంది అక్కడ లిక్కర్ ​తాగుతున్నారు.  

ALSO READ: పాత ప్రాజెక్టులను .. పక్కన పెట్టిండ్రు

వారిలోని ఓ వ్యక్తి బయటకు వెళ్లగా అంతలోనే మరికొంతమంది వచ్చి ఖాళీగా ఉన్న ఆ కుర్చీని తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి కుర్చీలు, బీరు సీసాలు విసురుకుంటూ ఘర్షణ పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్​కు తరలించారు.