కోడి పందాలు.. నలుగురు అరెస్ట్

కోడి పందాలు.. నలుగురు అరెస్ట్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పీఎస్​పరిధిలో  కోడి పందాలు ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్​పల్లికి చెందిన సత్యనారాయణ(34), వెంకటరామన్​(36), వెంకటేశ్వరరావు(34), రాజు(33) కలిసి ఆదివారం మధ్యాహ్నం శంషీగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో బెట్టింగ్​పెట్టి కోడి పందాలు ఆడుతున్నారు. పక్కా సమాచారంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు పందెం కోళ్లతో పాటు రూ. 6,200 నగదు, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.