లేబర్​ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

లేబర్​ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

ములుగు, వెలుగు : లేబర్​ డిపార్ట్​ మెంట్ ఆధ్వర్యంలో ములుగులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ములుగులోని గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో లేబర్​ కార్డు ఉన్న వారికి సమాచారం అందించి పలురకాల వైద్యపరీక్షలు చేశారు. 

బీపీ, షుగర్​, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి బ్లడ్​  శాంపిల్స్​ సేకరించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ప్రత్యేకంగా చేపట్టిన మూడు వైద్యశిబిరాల్లో  సుమారు 420మందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్యశిబిరం ఇన్​చార్జి పవన్​ తెలిపారు.