స్టూడియో నుంచి టీమ్​లోకి

స్టూడియో నుంచి టీమ్​లోకి

న్యూఢిల్లీ:  ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమై, ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలంలో ఎవ్వరూ కొనుగోలుచేయకపోవడంతో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరాఠీ కామెంటరీ చెబుతున్న సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదృష్టం వరించింది. గాయపడ్డ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విల్లే స్థానంలో కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోమవారం రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరు తమ జట్టులోకి తీసుకుంది.  దాంతో, స్టూడియో రూమ్​ నుంచి కేదార్​ ఆర్​సీబీ టీమ్​లో చేరనున్నాడు. ఈ సీజన్​లో నాలుగు మ్యాచ్​లు ఆడిన విల్లే మూడు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు 2010లో ఐపీఎల్​లో ఎంట్రీ ఇచ్చిన కేదార్​ మొత్తం 91 మ్యాచ్​ల్లో 1196 రన్స్​ చేశాడు. చివరగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ తరఫున 17 మ్యాచ్​ల్లో బరిలోకి దిగాడు. విల్లే ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసుకున్న కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అతని బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. కోటి ఇస్తున్నట్టు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ తెలిపింది.