ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమర్జెన్సీని విధించారు. ఏప్రిల్ 1న దుబాయ్కి వెళ్లే ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో అధికారులు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు, 1000 అడుగుల ఎత్తులో పక్షి దాడి జరిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1642082804300398592
ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఎయిర్పోర్ట్ అధికారులు ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం విమానం దుబాయ్కి మధ్యాహ్నం 3.29 గంటలకు చేరుకోవాలి.
ఫిబ్రవరిలో సూరత్ నుండి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో పక్షులు కొట్టడంతో అహ్మదాబాద్కు మళ్లించాల్సి వచ్చింది. అహ్మదాబాద్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.