గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీల కంటే ఫండ్స్ బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీల కంటే ఫండ్స్ బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!
  •      ఇండెక్స్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జర్నీ స్టార్ట్ చేయాలని ఎనలిస్టుల సలహా
  •     ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధిగమించాలంటే ఎక్కువ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే అసెట్స్‌ వైపు చూడాలని వెల్లడి

న్యూఢిల్లీ :  గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ)  వంటి రిస్క్ తక్కువగా ఉండే అసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మహిళలు  తాజాగా మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు కూడా చూస్తున్నారు. వర్కింగ్ వుమెన్ (జాబ్స్ చేస్తున్న మహిళలు) ఇతర ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రయత్నిస్తున్నారు. బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాజా సర్వే ప్రకారం, వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వుమెన్ తమ పెట్టుబడులను డైవర్సిఫై చేసుకుంటున్నారు. 23 నుంచి 45 ఏళ్ల వయుసు ఉన్న  40 శాతం మంది వర్కింగ్ వుమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

మరో 40 శాతం మంది డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబ్బులు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ ఏజ్ గ్రూప్ మహిళలు  గోల్డ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల కంటే  ఎండోమెంట్  లేదా యులిప్ (యూనిట్ లింక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు చూస్తున్నారు. 15 శాతం మంది వర్కింగ్ వుమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.  వర్కింగ్ వుమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనాన్షియల్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగిందని బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పేర్కొంది. అలానే ఎటువంటి జాబ్స్ చేయకుండా ఇంటి పనులు చేసుకునే మహిళలు ఎక్కువ మంది ఉన్నారని వెల్లడించింది. 

వివిధ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి తెలుసుకోవడానికి ఇండ్లలో ఉండే వారి కంటే   వర్కింగ్ వుమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ అవకాశం ఉంటుందని  బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్  డీజీఎం నంద పద్మనాభన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అన్నారు. అవగాహన పెరిగితే  మహిళలు తమ పెట్టుబడులను డైవర్సిఫై చేసుకోగలుగుతారని వెల్లడించారు. సేవింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వచ్చే రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా మించడం లేదని ఆమె అన్నారు.  మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడం అవసరమని పేర్కొన్నారు. ‘ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఏడాదికి 6–7 శాతం దగ్గర ఉంటోంది. 

 దీనికి తోడు ఎడ్యుకేషన్ ఖర్చులు ఏడాదికి 10–15 శాతం మేర పెరుగుతున్నాయి. ఏడాదికి 7 శాతం రిటర్న్ ఇచ్చే ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లపై ఆధారపడడం మంచి నిర్ణయం కాదు’ అని నంద వివరించారు.  మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం మంచిదని సలహా ఇచ్చారు. 5 నుంచి 8 ఏళ్లకు గాను ఇన్వెస్ట్ చేస్తే  ఏడాదికి 12–15 శాతం రిటర్న్ పొందే అవకాశం ఉంటుందని అన్నారు. తెలివిగా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఎంచుకునే ముందు  మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి  టైమ్ కేటాయించాలని అన్నారు. 

నిఫ్టీ–50 వంటి ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మొదట ఇన్వెస్ట్  చేయాలని పేర్కొన్నారు. పాసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్ వైపు మొగ్గు చూపారు. ఇండెక్స్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిగినర్లకు సరిపోతుందని చెప్పారు. లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇన్వెస్ట్ చేయాలని నంద సలహా ఇచ్చారు. మార్కెట్ పడినా లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కట్టుబడి ఉండాలన్నారు. కాగా, బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బేస్ చేసుకొని ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రెడీ చేస్తారు. ఉదాహరణకు నిఫ్టీ 50 పై చాలా కంపెనీలు ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చాయి. సంబంధిత ఇండెక్స్ పెరిగే కొద్ది ఇన్వెస్టర్లకు రిటర్న్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాయి.