
కోల్బెల్ట్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పూర్తిచేయని పనులను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్, క్యాతనపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ అన్నారు. వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్శాఖ మంత్రి పదవి వచ్చినందుకు శనివారం రామకృష్ణాపూర్లోని విజయ గణపతి ఆలయంలో వివేక్ యువసేనా ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, కాంగ్రెస్ లీడర్లతో కలిసి 30 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
పార్వతి విజయ మాట్లాడుతూ.. మంత్రి వివేక్వెంకటస్వామితోనే మంచిర్యాల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. బీఆర్ఎస్హయాంలో పూర్తికాని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించారని గుర్తుచేశారు. భూనిర్వాసితులకు పూర్తి పరిహారం అందించారని, రామకృష్ణాపూర్ వైపు ఫ్లైఓవర్ అప్రోచ్ రోడ్ వెడల్పునకు రూ.1.5కోట్లు మంజూరు చేశారన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డు ఉద్యోగి, యోగా మాస్టర్ కొమురయ్యను సన్మానించారు. కాంగ్రెస్ లీడర్ ఎల్పుల సత్యనారాయణ, స్థానికులు పాల్గొన్నారు.