బాసర–మహోర్ రోడ్డు సర్వేకు కేంద్రం ఆదేశం : ఎమ్మెల్యే రామారావు

బాసర–మహోర్ రోడ్డు సర్వేకు కేంద్రం ఆదేశం : ఎమ్మెల్యే రామారావు
  • ఎమ్మెల్యే రామారావు పటేల్​కులేఖ రాసిన కేంద్రమంత్రి గడ్కరీ

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లా బాసర నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ మహోర్ క్షేత్రానికి( హిమాయత్ నగర్ ) రెండు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణానికి సర్వే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని ఎమ్మెల్యే రామారావు పటేల్​తెలిపారు. దీని పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లేఖ ద్వారా ఎమ్మెల్యే కు సమాచారం అందించగా.. మంగళవారం భైంసాలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. 

గత మే 5న రెండు పుణ్యక్షేత్రాల మధ్య భైంసా, కుభీర్​మీదుగా నేషనల్​ హైవే నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్​గడ్కరికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. తన విజ్ఞప్తిపై స్పందించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే పటేల్ కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా ముధోల్ లో ఈజీఎస్​కింద రోడ్ల నిర్మాణానికి రూ.7.97 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. రోడ్లకు నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. లీడర్లు పండిత్​రావు పటేల్​, సౌంవ్లీ రమేశ్, సాయినాథ్​తదితరులు ఉన్నారు.