ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నసీఐ సస్పెండ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నసీఐ సస్పెండ్

సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సైదానాయక్ సస్పెండ్ అయ్యారు. గద్వాల్ జోగులాంబ జిల్లా డిసిఆర్బిలో పనిచేస్తున్న సైదానాయక్.. ఈ నెల 6 నుండి 10 తేదీ వరకు విధులకు హాజరు కాకుండా హుజూర్ నగర్  ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  నిజామాబాద్ రేంజ్ డీఐజి సైదానాయక్ ను సస్పెండ్ చేశారు.