న్యూఢిల్లీ : రూ.50 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే బీ సింగ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసింది. వీరిలో వడోదర బేస్డ్ కంపెనీ అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ ఉన్నారు.
రెండు పైప్లైన్ ప్రాజెక్ట్లు శ్రీకాకుళం నుంచి అంగుల్, విజయపూర్ నుంచి ఆరైయలలో అడ్వాన్స్ ఇన్ఫ్రాకు ఫేవర్ చేసేందుకు గెయిల్ డైరెక్టర్ లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు చేతులు మారుతున్నాయని తెలుసుకున్న అధికారులు సోమవారం ఈ అరెస్టులు జరిపారు. ఢిల్లీ,నోయిడా, విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు.