- ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో గద్దర్ సంస్మరణ సభ
ఓయూ, వెలుగు: రాష్ట్రంలో 53 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే బీసీ సీఎం ఉండాలని.. బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రజా యుద్ధనౌక గద్దర్.. పార్టీని స్థాపించబోయే ముందే మరణించడం బాధాకరమన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు.
చీఫ్ గెస్టుగా హాజరైన గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బీసీని సీఎం చేస్తానని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ప్రకటించలేదని, బీసీల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్న రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఎందుకు సొంత పార్టీ పెట్టే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలు రాజ్యాధికారం సాధించాలంటే బలమైన రాజకీయ పీఠం ఉండాలని ఆయన తెలిపారు.