
- గంగమ్మ ఒడికి గణేశుడు
వెలుగు, నెట్వర్క్ : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శనివారం వినాయక శోభాయాత్రలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను భక్తులు గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగా వినాయక మండపాల వద్ద ఉంచిన లడ్డూలకు వేలం నిర్వహించారు. అనంతరం విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు డప్పుచప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ సంబరంగా శోభాయాత్రలు నిర్వహించారు.
'బోలో గణేశ్మహరాజ్కి జై ' అంటూ నినదించారు. మహిళలు, యువతులు కోలాటాలు, భజనలు చేశారు. వివిధ వేషాలు వేసుకున్న కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయా చోట్ల నిమజ్జనానికి తీసుకెళ్తున్న రకరకాల విఘ్నేశ్వరులను చూసి భక్తులు తరించిపోయారు. పోలీస్, మున్సిపాలిటీ, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులు ఆయా జిల్లాల్లోని చెరువుల వద్ద నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.