న్యూ ఇయర్ కోసం గోవా టూ హైదరాబాద్ డ్రగ్స్.. ఇద్దరి అరెస్ట్

న్యూ ఇయర్ కోసం గోవా టూ హైదరాబాద్ డ్రగ్స్.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల కోసం ఢిల్లీ, గోవాల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెప్పిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్ సైట్  ద్వారా డ్రగ్స్ కోసం విక్రయదారులను సంప్రదించి వారికి క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు పంపి ఆ ఇద్దరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద 44 ఎల్ఎస్డీ డగ్రస్ పేపర్స్, చాక్లెట్, బిస్కెట్, జెల్లీ, హైబ్రిడ్ రూపంలో చేసిన గంజాయిని, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ డ్రగ్స్ ను న్యూ ఇయర్ వేడుకల కోసం ఇతరులకు అమ్మేందుకు ఆ యువకులు ప్లాన్ చేస్తుండగా సమాచారం తెలిసి అరెస్ట్ చేశామన్నారు. జగద్గిరిగుట్టలో ఇద్దరినీ బాలానగర్ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారని బాలానగర్ డీసీపీ సందీప్ తెలిపారు. నిందితులు అఖిల్ (22), పరమేశ్ (20).. ఇద్దరు వారి స్నేహితులు, సిటీలోని వేర్వేరు కాలేజీల్లోని విద్యార్థులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిసిందన్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.10లక్షలు ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

గాంధీని దూషించిన ఆధ్యాత్మిక గురువు అరెస్టు

ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుంది?

సంక్రాంతికి కరోనా థర్డ్ వేవ్