కోర్టులో గ్యాంగ్‎స్టర్ హత్య.. లాయర్లుగా వచ్చిన దుండగులు

కోర్టులో గ్యాంగ్‎స్టర్ హత్య.. లాయర్లుగా  వచ్చిన దుండగులు

ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ మన్ గోగిపై ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ సహా మొత్తం నలుగురు మృతి చెందినట్లు సమాచారం. జితేందర్ ను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. న్యాయవాదుల వేషధారణలో ఉన్న ఇద్దరు దుండగులు కోర్టు ఆవరణలోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని హాస్పిటల్ తరలించామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం: 

నేను జనంలో ఒకడ్ని.. వెయ్యి మందితో సెక్యూరిటీ అవసరమా?

గర్భిణులకు కరోనా వ్యాక్సిన్​.. పుట్టబోయే పిల్లలకు యాంటిబాడీలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను రాత్రికి రాత్రే విశ్వనగరం చేయలేం