
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో గంజాయి అమ్ముతుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఉన్న రెస్ట్ ఏరియాలో మంచిర్యాల తిలక్నగర్కు చెందిన షేక్ అజీజ్, వనం సాయికృష్ణ, ఆసిఫాబాద్జిల్లా ఈస్గాంకు చెందిన తరుణ్సర్కార్ గంజాయి పోలీసులు పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు.
తరుణ్ సర్కార్ ఒడిశా నుంచి గంజాయిని మంచిర్యాలకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. గంజాయికి అలవాటుపడ్డ అజీజ్, సాయికృష్ణ అమ్మకానికి సహకరిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.15వేల విలువైన 750 గ్రాముల గంజాయి, ఓ ఆటో, మూడు మొబైల్స్స్వాధీనం చేసుకు న్నారు. తరుణ్, అజీజ్పై ఇప్పటికే గంజాయి కేసులున్నాయన్నారు.----