గ్యాస్ సిలిండర్ లీకై మంటలు.. రూ.50 వేల ఆస్తి నష్టం

గ్యాస్ సిలిండర్ లీకై మంటలు.. రూ.50 వేల ఆస్తి నష్టం

కమలాపూర్, వెలుగు: వంట చేస్తుండగా గ్యాస్​ సిలిండర్​ లీకవడంతో మంటలు చెలరేగి రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన శనిగరపు రమేశ్ ​ఇంట్లో మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకైంది.

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇరుగుపొరుగు వారు, స్థానిక యువకులు వచ్చి సిలిండర్​ఆఫ్​చేసి ఇంట్లోని వారిని బయటకు తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా  మిక్సీ, నిత్యావసర వస్తువులు, బియ్యం, వంట సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.