గట్టేపల్లి మానేరు వాగు ఇసుక రీచ్‌‌‌‌లు రద్దు చేయాలి

గట్టేపల్లి మానేరు వాగు ఇసుక రీచ్‌‌‌‌లు రద్దు చేయాలి

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగు వద్ద నిర్వహిస్తున్న ఇసుక రీచ్ లను రద్దు చేయాలని గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజు కొనసాగాయి. రీచ్‌‌‌‌లను రద్దు చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని మానేరు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్నారు. కార్యక్రమంలో లీడర్లు డి.దామోదర్ రావు, శీలం శంకర్, రాజమౌళి, కనుకయ్య, కొలిపాక శ్రీనివాస్, బాపూరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, కదంబాపూర్ రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు.