థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో గాయత్రి జోడీ ఓటమి

థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో గాయత్రి జోడీ ఓటమి

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్లు ట్రిసా జాలీ– పుల్లెల గాయత్రి.. థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోనే ఇంటిముఖం పట్టారు. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్ క్వార్టర్స్‌‌లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ ట్రిసా–గాయత్రి 12–21, 21–17, 21–23తో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌ ఫెబ్రియానా కుసుమ–అమాలియా చాయా ప్రత్వి (ఇండోనేసియా) చేతిలో ఓడారు.

మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో మిథున్‌‌‌‌‌‌‌‌ మంజునాథ్‌‌‌‌‌‌‌‌ 19–21, 15–21తో మార్క్‌‌‌‌‌‌‌‌ క్లాజోవ్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో పరాజయం చవిచూశాడు. అయితే విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో అష్మితా చాలియా సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఆమె 21–14, 19–21, 21–13తో ఎస్టర్‌‌‌‌‌‌‌‌ నురుమి ట్రైవార్డోయో (ఇండోనేసియా)పై గెలిచింది.