ఈ-వేస్ట్పై బల్దియా స్పెషల్ ఫోకస్

ఈ-వేస్ట్పై బల్దియా స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ–-వేస్ట్ సేకరణపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్​లో ఈ–-వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయించారు. ఇటీవల జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​లో 2.5 టన్నుల ఈ–-వేస్ట్ తొలగించారు. 

ఇక్కడే ఇంత వేస్టేజ్ బయట పడిందంటే గ్రేటర్​లో మొత్తం వేల టన్నులు వెలువడే అవకాశం ఉందని అంచనా.  ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలకు లేఖలు రాయడానికి బల్దియా సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక ఫోన్ నంబర్​ను ఏర్పాటు చేసి, కాల్ చేస్తే ఈ–-వేస్ట్​ను తీసుకెళ్లేందుకు 10 వాహనాలను రెడీ చేయనుంది. 

ఈ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్​ను కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ ఆఫీసుల్లోనూ ఈ-–వేస్ట్​ను డంపింగ్ యార్డుకు తరలించాలని డీసీ, జోనల్ కమిషనర్లకు సూచించారు.