
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సున్ లోపు నిర్మాణంలో ఉన్న పనులు పూర్తి చేయాలని చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు తమ సొంత ఆఫీస్కు సంబంధించిన పనులు మాత్రం సరిగ్గా వర్షాల టైంలోనే మొదలు పెట్టారు. హెడ్ఢాఫీస్లోని ఫస్ట్ ఫ్లోర్ లో కమిషనర్ చాంబర్కు ముందు భాగంలో గార్డెనింగ్ కోసం రూఫ్ పై పనులు చేయిస్తున్నారు.
ఈ క్రమంలో స్లాబ్పై డ్రిల్లిండ్ వేస్తుండగా, స్లాబుకు డ్యామేజ్ అయింది. దీంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గ్రౌండ్ ఫ్లోర్లోని కస్టమర్ సర్వీస్ సెంటర్, ఇన్ వార్డు సెంటర్ తో పాటు విజిలెన్స్ ఆఫీస్ లోకి వర్షపునీరు చేరింది. అధికారుల క్యాబిన్ లో పెచ్చులు ఊడి పడ్డాయి.