
మల్లాపూర్, వెలుగు:- బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి చెందిన బాలికపై అదే మండలానికి చెందిన మర్రిపల్లి సాయినాథ్(24) అత్యాచారం చేశాడు.
2021 ఏప్రిల్ 4న నిందితుడిపై ఎస్సై రవీందర్ పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాలికకు రూ.2లక్షలు పరిహారం అందించాలని ఆదేశించారు.