ఫామ్ హౌస్ లో ఎయిర్ గన్ పేలిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిరాలలోని ఓ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగింది. పిల్లల ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. శాన్వి అనే నాలుగు సంవత్సరాల బాలిక ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శాన్వి మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు డాక్టర్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి చెప్పారు.
మరిన్ని వార్తల కోసం: