కొడుకును ప్రేమించింది.. వాళ్ల నాన్నతో చెక్కేసింది

కొడుకును ప్రేమించింది.. వాళ్ల నాన్నతో  చెక్కేసింది

ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ప్రేమ కథ వెలుగు చూసింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రిని ప్రేమించింది.  అంతేకాదు  అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు లేని సమయం చూసి.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు.    ఏడాది తర్వాత పోలీసులు వారిద్దరినీ ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు షాకింగ్ సమాచారం తెలిసింది. కానీ పోలీసులు ఏమీ చేయలేకపోయారు.దాదాపు ఏడాది తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

 కమలేష్​ అనే వ్యక్తి  ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా నుంచి పని కోసం  కాన్పూర్​ లోని చకేరీ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నారు.  కమలేష్​కు 20 ఏళ్ల కుమారుడు ఉండేవాడు.  అతను భవన నిర్మాణ కూలి పని చేసేవాడు.  ఇక్కడే ఉంటున్న 20 ఏళ్ల యువతితో  కమలేష్​ కుమారుడికి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ యువతి అప్పుడప్పుడు అతని ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్‌తో ఆమెకు మాటలు కలిశాయి. రాను రాను మాటల సంబంధం కాస్త ప్రేమ బంధంగా మారింది. వీరి ప్రేమ విషయం తన ప్రియుడికి తెలియదు. ఆ తర్వాత ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 2022లో, ఇద్దరూ ఇంటి నుండి పరారీ అయ్యారు.

కమలేష్ కొడుకు ఇంట్లోనే ఉంటుండడంతో బాలిక కుటుంబీకులు అతడిని అనుమానించలేదు. అయితే బాలిక కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్‌లో బాలిక మిస్సింగ్  కేసు పెట్టారు. ఈ యువతి కమలేష్‌ను కలిసేందుకు వచ్చేదని తెలిసి పోలీసులు కమలేష్ కుమారుడిని విచారించారు. దీంతో నిజం తెలిసింది. తన స్నేహితురాలి తండ్రి కిడ్నాప్ చేశారని కూడా చెప్పాడు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు కమలేష్ ఢిల్లీలో ఉంటూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తేలింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రత్నేష్ సింగ్ తెలిపారు. తన తండ్రి చేసిన ఈ ఘనత కొడుకుకు తెలుసు. అయినా సిగ్గుతో ఎవరికీ ఏమీ చెప్పలేకపోయాడు. పోలీసులు కమలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఇద్దరి వాంగ్మూలం నమోదు చేశారు. చిన్నారి వాంగ్మూలం తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. కమలేష్‌తో కలిసి జీవించాలనుకుంటున్నట్లు ఈ అమ్మాయి చెబుతోంది.