ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్రమైన ప్రేమ కథ వెలుగు చూసింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రిని ప్రేమించింది. అంతేకాదు అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు లేని సమయం చూసి.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఏడాది తర్వాత పోలీసులు వారిద్దరినీ ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు షాకింగ్ సమాచారం తెలిసింది. కానీ పోలీసులు ఏమీ చేయలేకపోయారు.దాదాపు ఏడాది తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
కమలేష్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ఔరియా నుంచి పని కోసం కాన్పూర్ లోని చకేరీ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నారు. కమలేష్కు 20 ఏళ్ల కుమారుడు ఉండేవాడు. అతను భవన నిర్మాణ కూలి పని చేసేవాడు. ఇక్కడే ఉంటున్న 20 ఏళ్ల యువతితో కమలేష్ కుమారుడికి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ యువతి అప్పుడప్పుడు అతని ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్తో ఆమెకు మాటలు కలిశాయి. రాను రాను మాటల సంబంధం కాస్త ప్రేమ బంధంగా మారింది. వీరి ప్రేమ విషయం తన ప్రియుడికి తెలియదు. ఆ తర్వాత ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 2022లో, ఇద్దరూ ఇంటి నుండి పరారీ అయ్యారు.
కమలేష్ కొడుకు ఇంట్లోనే ఉంటుండడంతో బాలిక కుటుంబీకులు అతడిని అనుమానించలేదు. అయితే బాలిక కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్లో బాలిక మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ యువతి కమలేష్ను కలిసేందుకు వచ్చేదని తెలిసి పోలీసులు కమలేష్ కుమారుడిని విచారించారు. దీంతో నిజం తెలిసింది. తన స్నేహితురాలి తండ్రి కిడ్నాప్ చేశారని కూడా చెప్పాడు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు కమలేష్ ఢిల్లీలో ఉంటూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తేలింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీస్ ఇన్స్పెక్టర్ రత్నేష్ సింగ్ తెలిపారు. తన తండ్రి చేసిన ఈ ఘనత కొడుకుకు తెలుసు. అయినా సిగ్గుతో ఎవరికీ ఏమీ చెప్పలేకపోయాడు. పోలీసులు కమలేష్ను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఇద్దరి వాంగ్మూలం నమోదు చేశారు. చిన్నారి వాంగ్మూలం తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. కమలేష్తో కలిసి జీవించాలనుకుంటున్నట్లు ఈ అమ్మాయి చెబుతోంది.