భారతీయ పురాణ ఇతిహాసం రామాయణం మరోసారి వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్తో, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో రెండు భాగాలుగా ‘రామాయణ’ చిత్రం రూపొందుతోంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ హిందీ చిత్రాన్ని నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు.
నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ‘రామ’ గ్లింప్స్ లాంచ్ వేడుకను గ్రాండ్గా నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో సన్నీ డియోల్ హనుమంతునిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
