గ్లోబల్​ కార్బన్ ప్రాజెక్ట్​ రిపోర్ట్

గ్లోబల్​ కార్బన్ ప్రాజెక్ట్​ రిపోర్ట్
  •  భూమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్​, రసాయన ఎరువులు, జంతువుల వ్యర్థాల కారణంగా 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40 శాతం పెరిగాయని గ్లోబల్​ కార్బన్ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ పేర్కొంది. 
  •     15 దేశాల్లోని 55 సంస్థలకు చెందిన 58 మంది పరిశోధకుల బృందం గ్లోబల్​ కార్బన్ ప్రాజెక్ట్​ పేరుతో రూపొందించిన నివేదికలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్​, అమెరికా, బ్రెజిల్​, రష్యా, పాకిస్తాన్​, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా దేశాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్గారాలు విడుదలయ్యే దేశాల జాబితాలో తొలి 10 స్థానాల్లో ఉన్నాయి. 
  •     కార్బన్ డై ఆక్సైడ్​, మిథేన్​ భూమిని వేడెక్కిస్తున్న గ్రీన్​ హైస్​ వాయువుల్లో నైట్రస్ ఆక్సైడ్​ కూడా ఉంది. 
  •     పారిశ్రామికీకరణ కంటే ముందు కాలంతో పోలిస్తే భూమి సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్​ మేరకు పెరిగింది. ఇందులో మానవ చర్యలతో వెలువడే నైట్రస్​ ఆక్సైడ్​ కారణంగా పెరిగిన ఉష్ణోగ్రత వాటా 0.1 డిగ్రీల సెల్సియస్​గా అంచనా వేస్తున్నారు. 
  •     గడిచిన దశాబ్ద కాలంలో వాతావరణంలోకి చేరిన ఈ వాయు ఉద్గారాల్లో 74 శాతం నత్రజని ఎరువులు, వ్యవసాయంలో ఉపయోగించే సేంద్రియ ఎరువుల నుంచే వచ్చాయి. 
  •     2022లో వాతావరణంలో నైట్రస్ ఆక్సైడ్​ గాఢత 336 పార్ట్స్​ పర బిలియన్​కు పెరిగింది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే ఇది 25 శాతం అధికం.
  •     భూతాపంలో పెరుగుదలను రెండు డిగ్రీలసెల్సియస్​ కంటే తక్కువకు పరిమితం చేయాలంటే 2019 నాటితో పోలిస్తే 2050 నాటికి మానవ చర్యలతో వెలువడే నైట్రస్​ ఆక్సైడ్​ ఉద్గారాలు కనీసం 20 శాతం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచించారు.