‘జెంటిల్ మెన్2’ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు

‘జెంటిల్ మెన్2’ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు

హీరో అర్జున్ ‘జెంటిల్ మెన్’ సినిమాకు 30 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. ‘జెంటిల్ మెన్2’ టైటిల్ తో  అది తెరకెక్కబోతోంది. ఈ మూవీకి నిర్మాతగా కె.టి.కుంజు మోహన్ వ్యవహరిస్తుండగా, దర్శకుడి పేరు తాజాగా సోమవారం వెల్లడైంది. ఎ.గోకుల్ కృష్ణ డైరెక్టర్ గా వ్యవహరిస్తారంటూ నిర్మాత కుంజుమోహన్ ట్వీట్ చేశారు. బిల్లా, ఆహా కల్యాణం సహా పలు ప్రఖ్యాత సినిమాలకు గోకుల్ కృష్ణ డైరెక్షన్ చేశారు.‘జెంటిల్ మెన్2’ సంగీత దర్శకుడిగా కీరవాణి  ఉంటారు.

హీరోయిన్లుగా నయనతార, ప్రియాలాల్ లను ఎంపిక చేశారు. హీరో ఎవరు అనేది త్వరలోనే ప్రకటిస్తామని కె.టి.కుంజుమోహన్ వెల్లడించారు. వాస్తవానికి సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘జెంటిల్ మెన్’ మూవీ 30 ఏళ్ల క్రితం రూపుదిద్దుకుంది. ఒక రాజకీయ అంశం ఇతివృత్తంగా జెంటిల్ మెన్2 సినిమా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు..

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు దోపిడి

ఉద్యోగాల పేరుతో టోకరా.. వ్యక్తి అరెస్టు