
నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే ఈ వేడుక వివరాలను తెలియజేసేందుకు బుధవారం కర్టన్రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ ఈవెంట్ పోస్టర్ను లాంచ్ చేశారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకులు కోదండరామిరెడ్డి, బోయపాటి శ్రీను, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు, సి.కల్యాణ్, దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, చదలవాడ శ్రీనివాసరావు, వైవీఎస్ చౌదరి, తుమ్మల ప్రసన్నకుమార్, కైకాల నాగేశ్వరరావు, నటులు శివబాలాజీ, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.