కోవిడ్–19 మహమ్మారి వేళ, ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు నూతన సాధారణత నేపథ్యానికి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఇవాళ ‘మహమ్మారి వేళ పౌష్టికాహారం మరియు కుటుంబ ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై ఓ సదస్సును నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమంలో దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతలపై చర్చించడంతో పాటుగా తమ రోజువారీ ఆహారం, జీవనశైలిలో కుటుంబాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సైతం చర్చించారు. ఈ సదస్సుకు నటి, వ్యాఖ్యాత షర్మిల కాసాల మోడరేట్ చేయగా, సెలబ్రిటీ ఫిట్నెస్ నిపుణురాలు మరియు శిక్షకురాలు కిరణ్ డెంబ్లాతో పాటుగా న్యూట్రిషన్ –వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పాల్గొన్నారు.
రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడం మరియు దానికి మద్దతునందించేలా పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి సెలబ్రిటీ ఫిట్నెస్ నిపుణురాలు , శిక్షకురాలు కిరణ్ డెంబ్లా మాట్లాడుతూ.. ‘‘గత సంవత్సరం వినూత్నమైనది. మనలో చాలామందికి జీవితపు విలువను తెలియజేసింది. ఓ తల్లిగా, భార్యగా నా కుటుంబ ఆరోగ్యం, భద్రతను నిర్వహించడం తగిన నివారణ చర్యలను తీసుకోవడం నా బాధ్యత అని నేను భావిస్తుంటాను. దీనికోసం, నేను బాదములపై ఆధారపడుతుంటాను. ఈ బాదములలో రోగ నిరోధకశక్తికి మద్దతునందించే పోషకాలు అయినటువంటి జింక్ సైతం ఉంది. ఇది ఎదుగుదల, వృద్ధి మరియు రోగ నిరోధక శక్తి పనితీరు మెరుగుపరచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వేళలా ఇంటిలో బాదములు ఉండేలా నేను తగు జాగ్రత్తలు తీసుకుంటుంటాను. ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములను మా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ తింటుంటారు. గత కొన్నేళ్లగా నేను ఇది మా ఇంటిలో తప్పనిసరిగా ఆచరించేలా చేస్తున్నాను. నగరంలోని ప్రతి కుటుంబమూ ఇదే రీతిలో చేయాలని కోరుతున్నాను’’ అని అన్నారు.
ఈ సదస్సులో షీలా కృష్ణ స్వామి, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. ‘‘ భారతీయ కుటుంబాలలో గతానికన్నా మిన్నగా సరైన పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఈ మహమ్మారి వెల్లడించింది. ఎంతోమంది భారతీయులు అత్యధిక రక్తపోటు, కార్డియోవాస్క్యులర్ వ్యాధులు (సీవీడీ), మధుమేహం , ఊబకాయం లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. ఈ తరహా వ్యాధులే కోవిడ్–19 రోగుల నడుమ మృత్యువుకూ కారణమవుతుంది. ఎందుకంటే ఇవి సమృద్ధిగా పోషకాలను కలిగి ఉంటాయి .. శరీరానికి తగిన పోషకాలనూ అందిస్తాయి. వీటితో పాటుగా బాదములలో రాగి, ఫోలేట్, ఇనుము, విటమిన్ ఈ వంటివి అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తికి ఇవి తగిన మద్దతును ఇవి అందిస్తాయి. అందువల్ల, ఓ గుప్పెడు బాదములను మీ రోజువారీ డైట్లో భాగం చేసుకోవడాన్ని తప్పనిసరి చేసుకోండి!’’ అని అన్నారు.