
న్యూఢిల్లీ: యూనియన్ టెరిటరీ లడఖ్లో 85 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేంద్ర ప్రభుత్వం రిజర్వు చేసింది. అలాగే లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఫర్ విమెన్లో మొత్తం సీట్లలో మూడింట ఒక వంతును మహిళలకు రిజర్వు చేసింది. ఈమేరకు కొత్త రిజర్వేషన్లు, డొమిసైల్ రూల్స్ను నోటిఫై చేస్తూ కేంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక తమ భాష, సంస్కృతి, భూభాగాన్ని పరిరక్షించాలని కోరుతూ లడఖ్లో స్థానికులు గత కొన్నేండ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం తాజా నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాల్లో మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆ నోటిఫికేషన్లో కేంద్రం తెలిపింది.