
కరోనా కారణంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం సిస్టమ్ పెట్టాయి. అయితే గూగుల్ తమ సంస్థలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులను తిరిగి ఆఫీస్లకు రావాలని సూచిస్తోంది. ఉద్యోగుల పని తీరు సమీక్షల్లో అటెండెన్స్ను ఓ భాగంగా చేసినట్లు కంపెనీ తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురితమైన ఓ నివేదిక ఇదే అంశాన్ని హైలెట్ చేసింది. రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని గూగుల్అమలు చేస్తూ ఉద్యోగులపై ఎలా ఒత్తిడి తెస్తుందో ఇందులో పేర్కొంది.
ఉద్యోగులకు ఈ విషయమై గూగుల్ మెయిల్స్ పంపుతోందని తెలిపింది. ప్రస్తుతం గూగుల్ హైబ్రీడ్పాలసీ కలిగి ఉంది. ఇక్కడి ఉద్యోగి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తరచూ ఆఫీస్లో రిపోర్ట్ చేయలేని ఉద్యోగులకు రిమైండర్లను పంపిస్తామని నివేదిక పేర్కొంది.