సరిహద్దు దేశాల నుంచి రూ.లక్ష కోట్ల ఎఫ్‌‌‌‌డీఐలు!

సరిహద్దు దేశాల నుంచి రూ.లక్ష కోట్ల ఎఫ్‌‌‌‌డీఐలు!

న్యూఢిల్లీ: భూసరిహద్దు దేశాల నుంచి గత మూడేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌డీఐ) ప్రపోజల్స్ అందుకున్నామని సంబంధిత ప్రభుత్వ అధికారి వెల్లడించారు.  ఇందులో సగం అప్లికేషన్లకు క్లియరెన్స్ ఇచ్చామని చెప్పారు. మిగిలిన ప్రపోజల్స్‌‌‌‌లో కొన్ని పెండింగ్‌‌‌‌లో ఉండగా, మరికొన్ని విత్‌‌‌‌డ్రా అయ్యాయని అన్నారు.

కొన్నింటిని ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని  వివరించారు. కాగా, ఇండియన్ కంపెనీలను  సరిహద్దు దేశాలకు చెందిన కంపెనీలు ముఖ్యంగా చైనీస్ కంపెనీలు  టేకోవర్ చేయకుండా ఉండేందుకు ఏప్రిల్‌‌‌‌ 2020 లో ప్రభుత్వం రూల్స్‌‌‌‌ కఠినం చేసింది. చైనా, బంగ్లాదేశ్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌, భూటాన్‌‌‌‌, నేపాల్‌‌‌‌, మయన్మార్‌‌‌‌‌‌‌‌, ఆఫ్ఘానిస్తాన్‌‌‌‌   ఇండియాతో ల్యాండ్ బోర్డర్ పంచుకుంటున్నాయి.

ఈ రూల్స్ ప్రకారం, ఈ దేశాల నుంచి వచ్చే ఎఫ్‌‌‌‌డీఐలు ప్రభుత్వ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎఫ్‌‌‌‌డీఐ అప్లికేషన్లను పూర్తిగా రిజెక్ట్ చేయడం లేదని,  దేశ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌ను మెరుగుపరుస్తాయా? లేదా? అని ముందు గమనిస్తున్నామని ప్రభుత్వ అధికారి చెప్పారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న ప్రపోజల్స్‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీలు, సంబంధిత మినిస్ట్రీల దగ్గర ఉన్నాయని  అన్నారు.