కాబూల్ లో మనోళ్లంతా సేఫ్..

కాబూల్ లో మనోళ్లంతా సేఫ్..

కాబూల్ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించింది కేంద్రం. మధ్యాహ్న భోజనం చేసి వారంతా కాబూల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరాని స్పష్టం చేసింది. అధికారులు వారితో టచ్ లో ఉన్నారని తెలిపింది. వారందరిని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. ఉదయం వంద నుంచి 150 మంది భారతీయులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారని అఫ్గాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐతే భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్లు స్థానిక రిపోర్టర్లు స్పష్టం చేశారు. వారందరిని కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.