ఆ ఘనత బ్రహ్మకుమారీలకే దక్కుతుంది : గవర్నర్

ఆ ఘనత బ్రహ్మకుమారీలకే దక్కుతుంది : గవర్నర్

యాదాద్రి భువనగిరి జిల్లా  : సామాన్య మానవుడు భగవంతుడికి చేరువయ్యే మార్గాన్ని బ్రహ్మకుమారీలు చూపుతున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మనో ధైర్యాన్ని, జీవితానికి అత్యవసరమైన మనశ్శాంతిని పొందేందుకు దోహదపడే మహత్తర బోధనలను బ్రహ్మకుమారీస్ ప్రపంచానికి అందిస్తున్నారని కొనియాడారు.

యాదాద్రి భువనగిరి జిల్లా  బీబీనగర్ మండలం  మహాదేవపూర్ లోని బ్రహ్మకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు.  మనిషి మనసును కేవలం ప్రశాంతతతోనే సంతృప్తిపర్చగలమన్నారు. ఈవిషయాన్ని సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెబుతున్న ఘనత బ్రహ్మకుమారీలకే దక్కుతుందని పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ సంస్థ నిస్వార్థమైన మానవ సేవ చేస్తోందని తెలిపారు.