ముంబై: మహదేవ్ యాప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. మహదేవ్ యాప్ నిర్వాహకులు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్కు ముంబై అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు గుర్తించింది.
పాకిస్తాన్లో ఖేలోయార్ బెట్టింగ్ యాప్ నిర్వహించేందుకు డి -కంపెనీతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించింది. ఈ యాప్ను ఆపరేట్ చేయడానికి "డి" సూచనల మేరకు చంద్రకర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ముస్తాకీమ్ ఇబ్రహీం కస్కర్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు వెల్లడించింది.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత 2021లో తమ పరిశోధన డీ కంపెనీ భాగస్వామ్యాన్ని ప్రారంభించిందని ఈడీ అధికారులు వెల్లడించారు. ముస్తాక్వీమ్ పాకిస్తాన్లో బెట్టింగ్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా.. చంద్రకర్ యాప్కు రక్షణ , లాజిస్టికల్ మద్దతును అందజేస్తున్నట్లు గుర్తించారు.
యాప్ కు బాలీవుడ్ ప్రముఖుల ప్రమోషన్
ఖేలో యార్ యాప్ ను బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ప్రమోట్ చేశారు. గోవిందా, రణదీప్ హుడా, నీల్ నితిన్ ముఖేష్, డైసీ షా, రష్మీ దేశాయ్, షెఫాలీ జరీవాలాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పాకిస్థాన్ ఆధారిత యాప్ను వీడియో క్లిప్ల ద్వారా ఆమోదించారు.
ఖేలోయర్ యాప్ అనేది మహాదేవ్ బుక్ యాప్ని పోలిన ఆన్లైన్ ప్లాట్ఫారమ్. ఇది క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, క్యాసినో గేమ్లను అందిస్తుంది. జిన్నా కరెన్సీని ఉపయోగించి బెట్టింగ్ పెట్టొచ్చు. గెలుపొందవచ్చు. ఈ ఆపరేషన్ సౌరభ్ చంద్రకర్ , రవి ఉప్పల్ నేతృత్వంలోని పాకిస్తాన్లోని దావూద్ ఇబ్రహీం నెట్వర్క్తో సంబంధం కలిగి ఉంది.
ఈ ఏడాది జూలైలో జరిగిన కొన్ని ఇతర చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ప్లాట్ఫారమ్లతో పాటు, శ్రీలంక T20 క్రికెట్ టోర్నమెంట్, లంక ప్రీమియర్ లీగ్ (LPL) కోసం ఖేలోయర్ గేమింగ్ యాప్ కూడా స్పాన్సర్ చేసింది. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ యాప్ భారతదేశంలో కూడా పనిచేస్తుంది. లావాదేవీలు ప్రధానంగా UPI, క్రెడిట్, డెబిట్ కార్డ్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతాయి. ప్లాట్ఫారమ్ను యాక్సెస్ చేయడానికి , చెల్లింపులు చేయడానికి పాకిస్థానీ వినియోగదారులు వారి పాకిస్థానీ ఫోన్ నంబర్లు, బ్యాంక్ వివరాలను అందించాలి.
చంద్రకర్, డి కంపెనీ సంబంధాలు:
ఈడీ ప్రకారం.. దావూద్ ఇబ్రహీం సోదరుడు ముస్తాకీమ్ ఇబ్రహీం కస్కర్ తన పాకిస్థానీ పాస్పోర్ట్లపై క్రమం తప్పకుండా UAEని సందర్శించేవారని తెలుస్తోంది. మూడేళ్ల క్రితం మహదేవ్ యాప్ విజయవంతమైన తర్వాత సౌరభ్ చంద్రకర్ ప్రభావవంతమైన షేక్ల సహాయంతో ముస్తకీమ్ను సంప్రదించారు. తన కోటి రూపాయల విలువైన ప్లాన్ను ముస్తాకీమ్తో డీల్ కుదుర్చుకున్నాడు. ఆపై అతను ఈ ప్లాన్ను "D"తో పంచుకున్నాడు. దావూద్ ఇబ్రహీం ఆమోదం తర్వాత చంద్రకర్ ఈ యాప్ ను పాకిస్తాన్ లో ముస్తాకీమ్ సహకారంతో ప్రారంభించాడు.
Also Read : శ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి
ఎఫ్పిజె గతంలో నివేదకల ప్రకారం.. దావూద్ ఇబ్రహీం సహకారం, ఐఎస్ఐ మద్దతుతో చంద్రకర్ పాకిస్తాన్లో బెట్టింగ్ యాప్ను ప్రారంభించాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నుండి వచ్చిన మూలాల ప్రకారం..సౌరభ్ చంద్రకర్ తన ఖేలోయార్ బెట్టింగ్ యాప్ను పాకిస్తాన్లో ఆపరేట్ చేయడానికి 2021లో 300 నుంచి 500 కోట్ల రూపాయల మధ్య పెట్టుబడి పెట్టాడు. అతను డి-కంపెనీకి మాత్రమే కాకుండా, తన భాగస్వామ్య వాటాతో పాటు, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), ఇతర ఏజెన్సీలు , రాజకీయ నాయకులకు కూడా డబ్బును చెల్లించాడని ఆరోపించారు. పాకిస్తాన్లో అతని నెట్వర్క్, వ్యాపారం , హవాలా కార్యకలాపాలను కొనసాగించేందుకు ఈ డబ్బును చెల్లించేవాడు.
2023ఫిబ్రవరి లో చంద్రకర్ వివాహం UAEలో జరిగింది. ఈ వేడుకలకు అతని పాకిస్తాన్ భాగస్వాములు, ఫ్రాంచైజీ యజమానులు, D-కంపెనీకి సంబంధం ఉణ్న సహచరులు హాజరైనట్లు గుర్తించారు. పాకిస్థానీ ఆధారిత వ్యాపార భాగస్వాములు, ఫ్రాంచైజీలు, D-కంపెనీ ఆపరేటివ్లను గుర్తించడానికి ED ప్రస్తుతం ఈ ఈవెంట్ల నుంచి వీడియో ఫుటేజీని విశ్లేషిస్తోంది.