
హైదరాబాద్, వెలుగు:ఇండియన్, చైనీస్ వంటి ఎన్నో రుచులు అందించే విజయవాడకు చెందిన గోల్డెన్ పెవిలియన్ హైదరాబాద్లోనూ రెస్టారెంట్ ప్రారంభించింది. సిటీలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో దీనిని ఏర్పాటు చేసింది. అత్యంత నాణ్యమైన మసాలాలు, బాస్మతీ బియ్యంతో తాము బిర్యానీలు, ఇతర వంటలు చేస్తామని సంస్థ ఎండీ సాజిద్ మహ్మద్ చెప్పారు. త్వరలో తాము అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ను, పార్క్ హయత్ సహకారంతో త్రీస్టార్ హోటల్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.