
H-4 వీసాతో అమెరికాలో ఉన్న దాదాపు లక్షమంది భారతీయుల పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. 21 యేళ్లు నిండినపుడు వారి తల్లిదండ్రులనుంచి వేరుచేయబడే ప్రమాదం ఉంది. ఈ వీసాతో గరిష్ట వయస్సు, గ్రీన్ కార్డు ప్రక్రియ దశాబ్దాలుగా పెండింగ్ ఉందని.. దీంతో అమెరికాలోని భారతీయులలో ఇది ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో గ్రీన్ కార్డుల మంజూరు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. దీంతో లక్ష మందికి పైగా భారతీయ పిల్లలు వారి తల్లిదండ్రులనుంచి విడిపోయే ప్రమాదం ఉంది. అమెరికాలో శాశ్వత నివాసం అందించే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం దాదాపు 10.7 లక్షల మంది భారతీయులు క్యూలో ఉన్నారు. ప్రతి దేశానికి 7 శాతం పరిమితి, పెండింగ్ కేసులు పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా 135 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. హెచ్-4 వీసా విధానంలో 21 ఏళ్లలోపు వ్యక్తులు USలో ఉండేందుకు అనుమతిస్తారు.
గ్రీన్ కార్డు దరఖాస్తులు ప్రాసెస్ చేసే సమయానికి హెచ్-4 వీసా కింద ఉన్న 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 యేళ్లు దాటిపోతారని కాటో ఇనిస్టిట్యూట్ లోని ఇమ్మిగ్రేషన్ స్టడీస్ నిపుణుడు డేవిడ్ జే బీర్ ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ఇది వారి తల్లిదండ్రులనుంచి బలవంతంగా విడిపోవడానికి దారి తీస్తుంది.
USలో భారతీయ కుటుంబాల మధ్య అనిశ్చితి
H-4 వీసాల వయో పరిమితి, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో పెండింగ్.. USలో స్థిరపడిన అనేక భారతీయ కుటుంబాలకు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
బిడెన్ అడ్మినిస్ట్రేషన్ 21 ఏళ్లు నిండిన నిర్దిష్ట H-4 వీసా హోల్డర్లను అమెరికాలో ఉండటానికి, పని చేయడానికి అనుమతించే ఒక నియమాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ నియమం ఎప్పుడు అమలు చేయబడుతుందో అస్పష్టంగా ఉంది. గ్రీన్ కార్డ్ల కోసం 7 శాతం కంట్రీ క్యాప్ను మారుస్తానని కూడా బిడెన్ హామీ ఇచ్చారు.