
హైదరాబాద్, వెలుగు: ప్లైవుడ్ కంపెనీ గ్రీన్ ప్లై నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఆయన కంపెనీ యాడ్స్ లో ఇక నుంచి కనిపిస్తారు. రెండేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. గ్రీన్ ప్లై ఎమిషన్స్ విడుదల చేయని ప్రొడక్ట్ లను మార్కెట్ లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన కమర్షియల్ యాడ్ ను లాంచ్ చేశారు. డోర్లు, కప్బోర్డ్ లు వంటి ఇంటీరియర్స్ కోసం ప్లై వుడ్ ను కంపెనీ తయారు చేస్తోంది. ఇండస్ట్రీ సైజ్ 4 బిలియన్ డాలర్లు ఉంటుందని, అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎక్కువగా విస్తరించిందని కంపెనీ సీఈఓ మనోజ్ తుల్సియన్ అన్నారు.
ప్లై వుడ్ మార్కెట్ లో ఆర్గనైజ్డ్ సెక్టార్ వాటా 25–-30 శాతం ఉంటుందని, ఇందులో తమ మార్కెట్ వాటా 20 శాతం వరకు ఉంటుందని వెల్లడించారు. తమ ప్రొడక్ట్ లకు టింబర్ రా మెటీరియల్ అని, తెలుగు రాష్ట్రాల్లో టింబర్ సప్లయ్ తక్కువని అన్నారు. అందుకే ఇక్కడ తయారీ ప్లాంట్ పెట్టే ఆలోచన లేదని చెప్పారు. తాజాగా గుజరాత్, యూపీ లో ప్లాంట్స్ పెట్టామని, వీటికి అదనంగా గుజరాత్ లో ఓ టర్కీ కంపెనీతో కలిసి ప్లాంట్ ఏర్పాటు చేశామని అన్నారు. గ్రీన్ ప్లై రెవెన్యూ 2022-–23 రూ. 1,800 కోట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్లు సాధిస్తామని పేర్కొన్నారు.