
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీ)గా గ్రూప్ 1 అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ కు రాజేశ్వర్, కొత్తగూడెంకు రవీంద్రనాథ్, ఆసిఫాబాద్ కు శ్రీరాములు, మహబూబాబాద్ కు హనుమ, గద్వాలకు శ్రీనివాసరావు, నిజామాబాద్ కు పవన్ కుమార్ను నియమించింది. ఇటీవల ఈ ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేశ్ కుమార్ రిలీవ్ చేసి హౌసింగ్ కార్పొరేషన్ లో డిప్యూటేషన్ పద్ధతిలో పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదే క్రమంలో వీరిని పీడీలుగా నియమిస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ శనివారం జీవో జారీ చేశారు. కాగా, మరో 3 జిల్లాలకు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లను కూడా నియమిస్తూ ఇంకో ఉత్తర్వు విడుదల చేశారు. ఇందులో సూర్యాపేటకు జీహెచ్ ఎంసీలో ఈఈగా పనిచేస్తున్న సిద్దార్థను, సిరిసిల్లకు శంకర్ను, వనపర్తికి వితోబాను నియమించారు.