చైనాకు ఇండియా చెక్

చైనాకు ఇండియా చెక్

షా ఆలమ్ (మలేసియా) : గాయం నుంచి కోలుకున్న డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు విక్టరీతో రీఎంట్రీ ఇచ్చిన వేళ బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌‌షిప్స్‌‌లో ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ బలమైన చైనాకు చెక్‌‌ పెట్టింది.   మెన్స్ టీమ్ కూడా హాంకాంగ్ పని పట్టి నాకౌట్ రౌండ్‌‌కు క్వాలిఫై అయింది.  బుధవారం జరిగిన గ్రూప్‌‌–డబ్ల్యూ మ్యాచ్‌‌లో ఇండియా అమ్మాయిలు 3–2తో టాప్ సీడ్ చైనాను ఓడించి నాకౌట్ చేరారు. అక్టోబర్‌‌‌‌ నుంచి ఆటకు దూరంగా ఉన్న సింధు తొలి సింగిల్స్‌‌లో 21–17, 21–15తో తనకంటే మెరుగైన ర్యాంకర్ హన్ యుయెను ఓడించి జట్టుకు శుభారంభం అందించింది. 

 తొలి డబుల్స్‌‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప, రెండో సింగిల్స్‌‌లో ఆష్మితా చాలిహా ఓడినా..రెండో డబుల్స్‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ తమ ప్రత్యర్థులపై గెలిచి స్కోరు 2–2తో సమం చేశారు. చివరి మ్యాచ్‌‌లో అన్మోల్ ఖర్బ్ 22–-20, 14-–21, 21-–18తో వు లువోను ఓడించి టీమ్‌‌ గెలిపించింది. మరోవైపు ఇండియా మెన్స్‌‌ టీమ్ గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌లో 4–1తో హాంకాంగ్‌‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌‌లో ప్రణయ్ ఓడినా.. మిగతా షట్లర్లు గెలిచారు.