హైదరాబాద్, వెలుగు: మేఘా కృష్ణారెడ్డి రూ.70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అలాగే రూ.12 వేల కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉందని స్వయంగా జీఎస్టీ అధికారులు చెబుతున్నా సీఎం కేసీఆర్ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. “మీ ఇద్దరు (కేసీఆర్, కృష్ణారెడ్డి) తోడు దొంగలనా? రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణ వాళ్లకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా? లేక మీ ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా? ఈ విషయంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? కృష్ణారెడ్డి మీకు (సంజయ్, రేవంత్) కూడా దోస్తు. మీకూ ముడుపులు అందుతున్నాయి. అందుకే మాట్లాడడం లేదా” అని షర్మిల ట్విటర్లో ప్రశ్నించారు.